తానా బహుమతి నవలలు ఆవిష్కరణ
తానా
బహుమతి నవలలు
ఆవిష్కరణ
మున్నీటిగీతలు అర్ధనారి
2021లో జరగవలసిన 23వ తానా మహాసభలు కోవిడ్ కారణంగా జరగక పోయినప్పటికీ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించినట్లుగానే రెండు లక్షల రూపాయల బహుమతితో తానా 2021లోనూ నవలల పోటీ నిర్వహించింది. ఈ పోటీకి వచ్చిన 107 నవలలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం బహుమతి మొత్తాన్ని రెండు నవలలకు సమానంగా అందించాలని నిర్ణయించారు.
అవి చింతకింది శ్రీనివాసరావు రచించిన 'మున్నీటి గీతలు', బండి నారాయణస్వామి రచించిన 'అర్ధనారి.' వీటి ఆవిష్కరణ సభ హైదరాబాద్లో 26 సెప్టెంబర్ 2022న తెలుగు విశ్వవిద్యాలయం ఆవరణలో అకాల కుంభవృష్టి వాతావరణంలోనూ ఆగకుండా సాగింది.
ఈ సభ సాయంత్రం ఆరుంపావుకి ప్రారంభం కావల్సి ఉండగా అయిదున్నరకి ప్రారంభమైన వర్షం అటు సభికుల, ఇటు వక్తల రాకకు తీవ్ర అంతరాయం కలగ జేసింది. వక్తలంతా వచ్చాక ఆలస్యంగా ప్రారంభమైన సభకు స్వాగతం పలుకుతూ కథాసాహితి సంపాదకులు, ఈ పోటీ నిర్వహణలో భాగస్వామ్యం వహించిన వాసిరెడ్డి నవీన్ తానా నిర్వహిస్తున్న పోటీ పూర్వాపరాలు, పుస్తకాల ప్రచురణ గురించి, ఇతర సాహిత్య కార్యక్రమాల నిర్వహణ గురించి వివరించారు. సభకు ప్రముఖ కవి కె. శివారెడ్డి అధ్యక్షత వహించగా, మరొక ప్రముఖ కవి నందిని సిధారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రచయితలకు బహుమతులను అందజేసారు.
ఈ సభకు ప్రత్యేక అతిథిగా తానా కోశాధికారి కొల్లా అశోక్ బాబు విచ్చేసారు.
సభకు అధ్యక్షత వహించిన శివారెడ్డి ఇలా ప్రతి సంవత్సరం నవలల పోటీ నిర్వహించడం పట్ల తానాకు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ రెండు పుస్తకాలను ఇద్దరు ప్రత్యేక వ్యక్తులు ఆవిష్కరించారు. చింతకింది. శ్రీనివాసరావు మున్నీటి గీతలు నవలను ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి క్రిష్ ఆవిష్కరించి సాహిత్యానికి, సినిమాకి తెగిపోయిన అనుబంధాన్ని పునరుద్ధరించడంలో ఈ నవలలు ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు. 2019లో బహుమతి పొందిన సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల కొండపాలంను సినిమాగా రూపొందించినట్లుగా ఈ మున్నీటి గీతలు నవలను కూడా వెబ్ సిరీస్ కోసం రూపొందిస్తు న్నట్లు ప్రకటించారు. ఇంకా ఇటువంటి మంచి నవలలు సినిమాగా తీయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.
బండి నారాయణస్వామి నవల అర్ధవారిని ఆవిష్కరించిన ప్రముఖ కన్నడ రచయిత, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత కుం. వీరభద్రప్ప మాట్లాడుతూ తెలుగు నేలతో, సాహిత్యంతో తనకున్న అనుబంధాన్ని విపులంగా వివరించారు. ఈ నవల ప్రత్యేకత గురించి, అంతకు ముందు స్వామి రాసిన తానా బహుమతి నవల శప్తభూమి గురించి కూడా మాట్లాడారు.
తానా కోశాధికారి కొల్లా అశోక్ బాబు మాట్లాడుతూ జంపాల చౌదరి నిర్వహణలో కన్నెగంటి చంద్ర నేతృత్వంలో సాగుతున్న ఈ పోటీలను, ఇతర సాహిత్య కార్యక్రమాలను నిర్వహించడానికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని తానా తరపున హామీ ఇచ్చారు.
అనంతరం బహుమతి ప్రదానం చేసి, లక్ష రూపాయల చెక్కులను రచయితలకు బహూకరించిన ప్రముఖ కవి నందిని సిధారెడ్డి మాట్లాడుతూ సినిమాల్లో ఉండే జుగుప్ప సాహిత్యంలో రాకుండా జాగ్రత్త పడుతూ, సాహిత్యానికి సినిమాకి అనుబంధం నిరంతరం కొనసాగా లని ఆకాక్షించారు.
ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన మధురాంతకం నరేంద్ర రెండు నవలల ప్రత్యేకతను సోదాహరణంగా వివరించి, ఈ పోటీల ద్వారా మంచి నవలలు తెలుగు సాహిత్యంలో వస్తాయని ఆకాంక్షిం చారు.
మరో న్యాయనిర్ణేత మహ్మద్ ఖదీర్ బాబు వర్షం వల్ల రాలేకపోయారు.
2017లో బహుమతి పొందిన నీల నవలా రచయిత కె.ఎన్. మల్లీశ్వరి మాట్లాడుతూ తన నవలకు బహుమతి వచ్చాక తన మీద మరింత బాధ్యత పెరిగిందని అన్నారు.
రచయిత చింతకింది శ్రీనివాసరావు మాట్లాడుతూ, అటు తానాకి, ఇటు తన నవలను వెబ్ సిరీస్ గా రూపొంది. స్తున్న క్రిష్కి కృతజ్ఞతలు తెలియజేసారు. నవలా సాహిత్యంలో నేడున్న పరిస్థితులను, నవలలు విస్తృతంగా రావలసిన అవసరాన్ని, రచయితలకున్న బాధ్యతలను మరో రచయిత బండి నారాయణస్వామి మాట్లాడి, రెండో సారి తనకు బహుమతి ఇచ్చినందుకు తానాకు కృతజ్ఞతలు తెలియజేసారు.