తానా నవలల పోటీ
తానా నవలల పోటీ
తెలుగు నవలా సాహిత్యానికి పునర్ వైభవం తీసుకురావాలన్న ఆకాంక్షతో 1997లో లాస్ ఏంజెల్స్ నగరంలో జరిగిన తానా మహాసభల సందర్భంగా,ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మొదటిసారిగా నవలల పోటీ నిర్వహించింది. ఆ మొదటి పోటీలో చంద్రలత రచించిన రేగడి విత్తులు నవల 1,30,000 రూపాయల ఏకైక బహుమతిని గెల్చుకొంది. అప్పటినుంచి 2005 వరకు తానా నవలల, కథల పోటీని నిర్వహించింది. మే 26, 27, 28 తేదీలలో సెయింట్ లూయిస్ నగరంలో 40వ వార్షికోత్సవం జరుపుకొంటున్న సందర్భంగా తానా రెండు లక్షల రూపాయలు బహుమతి మొత్తంగా నవలల పోటీని పునః ప్రారంభించింది.
దేశంలోని అనేక ప్రాంతాల నుంచి, అమెరికా నుంచి, లండన్ నుంచి 55 నవలలు పోటీకి వచ్చాయి. ప్రాథమిక వడపోత అనంతరం మిగిలిన నవలలను ప్రముఖ రచయితలు మృణాళిని, ఆడెపు లక్ష్మీపతి న్యాయ | నిర్ణేతలుగా పరిశీలించారు. వారి ఏకగ్రీవ నిర్ణయం మేరకు మూడు నవలలను అంతిమ పరిశీలనకు అమెరికాలోని తానా ప్రచురణల కమిటీకి పంపడం జరిగింది. తానా అధ్యక్షులు జంపాల చౌదరి, రచయిత గొర్తి సాయి బ్రహ్మానందం, కన్నెగంటి రామారావు న్యాయనిర్లేతలుగా వ్యవహరించారు. ఈ నవలలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ప్రకటించిన 2 లక్షల బహుమతి మొత్తాన్ని ఈ మూడు నవలలకు ఈ క్రింది విధంగా ఇవ్వాలని న్యాయనిర్లేతలు ఏకగ్రీవంగా నిర్ణయించారు.
శప్తభూమి |
- బండి నారాయణస్వామి అనంతపురం - |
రూ. 80,000 లు |
నీల |
- కె.ఎన్. మల్లీశ్వరి, విశాఖపట్టణం |
- రూ. 80,000 లు |
ఒంటరి |
- సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, |
బాలరాజుపల్లె, కడప జిల్లా - రూ. 40,000లు |
ఈ బహుమతి మొత్తాన్ని రచయితలకు తానా త్వరలో అందజేస్తుంది. ఈ మూడు నవలలను తానా త్వరలో ప్రచురించి పాఠకులకు అందచేస్తుంది. మా ఈ మొత్తం పోటీ నిర్వహణలో న్యాయనిర్లేతలకు రచయితల పేర్చు తెలియజేయకుండా కేవలం కోడ్ నెంబర్ల ద్వారా మాత్రమే నవలలను అందజేయడం జరిగింది. ఈ పోటీలో సహకరించిన రచయితలకు, న్యాయనిక్షేతలకు, పోటీ నిర్వహణలో సాయపడిన కథాసాహితి సంస్థకు, వాసిరెడ్డి నవీన్కు తానా తరపున కృతజ్ఞతలు. బహుమతులు గెలుచుకొన్న రచయితలకు మా అభినందనలు.