COVID19

తానా ఫౌండేషన్‍ అధ్యక్షుడు నిరంజన్‍ శృంగవరపు మాట్లాడుతూ, ఫౌండేషన్‍ ద్వారా వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు, ఎక్కడెక్కడ సేవలు అవసరమో గుర్తించి, ఆయా చోట్ల ఉన్న ఎన్‍జీవోలు, దాతల సహకారంతో కార్యక్రమాలను చేశామని అన్నారు. లక్షలాదిమందికి నిత్యావసర వస్తువులను, 4 లక్షల మందికి అన్నదానం వంటి కార్యక్రమాలను చేశామన్నారు. మా సేవా కార్యక్రమాల్లో ముందుగా కరోనా నుంచి రక్షణకోసం మాస్క్ లను వివిధ చోట్ల పంపిణీ చేశామన్నారు. దాదాపు 10 లక్షల మందికి మాస్క్ లను ఇచ్చామన్నారు. మేము మాస్క్ లు పంపిణీ కార్యక్రమం చేపట్టాక చాలామంది కూడా మాస్క్ లు పంపిణీకి ముందుకు వచ్చారన్నారు. ఈ సావనీర్‍లో చాలా సేవా కార్యక్రమాలను కవర్‍ చేశామని నిరంజన్‍ శృంగవరపు అన్నారు.

File Download : Download